ముంబై: భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ను భారత్ గెలువడంలో యువ క్రికెటర్ల పాత్రను కొనియాడాడు. తాము లేకుండా మ్యాచ్లు గెలువలేమని విర్రవీగే పేరున్న క్రికెటర్లకు ఇది చెంప దెబ్బ లాంటిదని సన్నీ వ్యాఖ్యానించాడు. ఒక ప్రైవేట్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ విజయంలో యువ క్రికెటర్లది కీలక భూమిక.
స్టార్ క్రికెటర్ల గైర్హాజరీలో యువ ప్లేయర్లు అవకాశాలను అద్భుతంగా అందిపుచ్చుకున్నారు. ముఖ్యం ధృవ్ జురెల్, సర్ఫరాజ్ఖాన్, ఆకాశ్దీప్సింగ్, రజత్ పాటిదార్ తమ విలువను చాటుకున్నారు. ఈ విషయంలో కెప్టెన్ రోహిత్శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర మరువలేనిది. వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్లనే ఇది సాధ్యమైంది అని అన్నాడు.