బ్రిడ్జ్టౌన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సర్కిల్ ప్రారంభించేందుకు టీమ్ఇండియా కసరత్తులు షురూ చేసింది. ఈ నెల 12 నుంచి వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే కరీబియన్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు శిక్షణలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా రెండు రోజుల ట్రైనింగ్ కమ్ ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొంటున్నది.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆఫ్స్టంప్ ఆవల పడ్డ బంతులపై సాధన చేస్తుంటే.. సిరాజ్ తన బంతికి పదును పెంచే పనిలో నిమగ్నమయ్యాడు. చతేశ్వర్ పుజారాను ఎంపిక చేయకపోవడంతో అతడి స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్ మ్యాచ్లో తొలి సారి జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్తో ఓపెనింగ్ చేయడంతో.. గిల్ వన్డౌన్లో బ్యాటింగ్ చేస్తాడనే ఊహగానాలు జోరందుకున్నాయి.