కొలంబో: టీ20 వరల్డ్కప్(T20 World Cup)లో ఆదివారం భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఆ మ్యాచ్పై ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే.. కొలంబోకు వెళ్లే విమానాలకు టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. ముంబై- కొలంబో మధ్య ఒక్కసారిగా టికెట్ ధరపై పది వేలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన ఆ మ్యాచ్ జరగనున్నది. అయితే తాజా రిపోర్టు ప్రకారం ముంబై-కొలంబో-ముంబై మధ్య విమాన టికెట్ ఛార్జీ 60 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండోపాక్ సమరానికి తగ్గ రీతిలో విమాన ఛార్జీలు కూడా పెరిగినట్లు కొన్ని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్ వివరాల ప్రకారం.. చండీఘడ్ నుంచి కొలంబోకు ఎయిర్ ఇండియా రౌండ్ ట్రిప్ సుమారు 63 వేలు ఉన్నది. ఇక ఇండిగో విమాన ఛార్జీలు సుమారు 70 నుంచి 74 వేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ-కొలంబో మధ్య ఆ తేదీల్లో విమాన ఛార్జీలు 45 వేలుగా ఉన్నట్లు బుకింగ్ డిటేల్స్ ద్వారా స్పష్టమవుతోంది.