గత రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేక.. సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు నామమాత్రమైన చివరి టీ20లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదట బౌలర్లు సమిష్టిగా సత్తాచాటి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగా.. ఆనక స్మృతి మంధన రాణించడంతో టీమ్ఇండియా అలవోకగా విజయం సాధించింది.
డర్బన్: స్వదేశంలో ఆస్ట్రేలియాపై పొట్టి సిరీస్ నెగ్గిన భారత జట్టు.. అదే ఊపులో దక్షిణాఫ్రికాపై కూడా శుభారంభం చేయాలనుకుంటే.. మ్యాచ్కు వరణుడు అడ్డుపడ్డాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా డర్బన్ వేదికగా ఆదివారం జరగాల్సిన మొదటి టీ20 ఒక్క బంతి పడకుండానే రైద్దెంది. మ్యాచ్ ఆరంభానికి ముందు నుంచే భారీ వర్షం కురువడంతో కనీసం టాస్ వేయడానికి కూడా వీలు పడలేదు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా పనికొస్తుందనుకున్న ఈ సిరీస్ వర్షంతో ప్రారంభమైంది. మధ్యలో వరణుడు కాస్త తెరిపినివ్వడంతో మ్యాచ్ జరుగుతుందేమో అని ఆశించినా.. తిరిగి వర్షం ముంచెత్తడంతో అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇరు జట్ల మధ్య మంగళవారం రెండో మ్యాచ్ జరగనుంది.
ముంబై: ఇంగ్లండ్ చేతిలో సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు.. ఓదార్పు విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టును చిత్తు చేసింది. దీంతో ఇంగ్లండ్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లో ఆకట్టుకోలేకపోయిన భారత్.. ఈ సారి సమిష్టిగా కదంతొక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హీతర్ నైట్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్సెంచరీతో రాణించగా.. అమీ జోన్స్ (25) పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్, సైఖా ఇషాఖ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. రేణుక సింగ్, అమన్జ్యోత్ కౌర్ రెండేసి వికెట్లు తీశారు.
ఒక దశలో 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి వందలోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన ఇంగ్లండ్ జట్టును హీతర్ నైట్ ఆదుకుంది.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి భారీ షాట్లతో విరుచుకుపడింది. ఫలితంగా ఇంగ్లిష్ జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్యఛేదనలో భారత్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగులు చేసి విజయం సాధించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధన (48; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. జెమీమా రోడ్రిగ్స్ (29; 4 ఫోర్లు) రాణించింది. ఆఖర్లో అమన్జ్యోత్ కౌర్ (4 బంతుల్లో 13 నాటౌట్; 3 ఫోర్లు) ఎడాపెడా బౌండ్రీలు బాది గెలుపును సులభతరం చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో కెంప్, ఎకెల్స్టోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చక్కటి బౌలింగ్తో మూడు వికెట్లు తీయడంతో పాటు రెండు క్యాచ్లు పట్టిన శ్రేయాంక పాటిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంగ్లండ్ ఆల్రౌండర్ స్కీవర్ బ్రంట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచింది.
ఇంగ్లండ్: 126 (హీతర్ నైట్ 52; శ్రేయాంక 3/19, సైఖా 3/22), భారత్: 19 ఓవర్లలో 130/5 (స్మృతి 48, జెమీమా 29; కెంప్ 2/24).