చెన్నై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు రూ. 12 లక్షల జరిమానా పడింది. మంగళవారం ఢిల్లీతో మ్యాచ్లో ముంబై జట్టు స్లో ఓవర్ రేట్కు పాల్పడటంతో ఐపీఎల్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్లో ముంబైకి ఇది మొదటి ఉల్లంఘన కావడంతో కెప్టెన్పై జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.