భారత హాకీ జట్టు ఇంగ్లండ్పై పైచేయి సాధించింది. భువనేశ్వర్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్లో రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. అయితే చివరకు షూటవుట్లో భారత జట్టు విజయం సాధించింది. కళింగ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. మ్యాచ్ ముగియడానికి కేవలం 12 సెకన్లు మాత్రమే ఉండగా ఇంగ్లండ్ ఆటగాడు గోల్ చేయడంతో.. మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది.
దీంతో షూటవుట్ ద్వారా విజేతను నిర్ణయించాలని నిర్ణయించారు. షూటవుట్లో కూడా రెండు జట్లు గట్టి పోటీనిచ్చాయి. ఐదు ఛాన్సుల్లో రెండు పాయింట్లు సాధించిన భారత జట్టు.. ఏడో అటెంప్ట్లో 3-2 తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది.