కౌలాలంపూర్: ప్రతిష్ఠాత్మక జూనియర్ హాకీ ప్రపంచకప్లో యువ భారత్కు చుక్కెదురైంది. గురువారం జరిగిన సెమీస్లో భారత్ 1-4 తేడాతో జర్మనీ చేతిలో ఓటమిపాలైంది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో టీమ్ఇండియాకు 12 పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కగా ఒక్క దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.
భారత్ తరఫున సుదీప్ (11ని) ఏకైక గోల్ చేయగా, జర్మనీ జట్టులో బెన్ హస్బాచ్(8ని, 30ని), గ్లెండర్ పాల్(41ని), ఫ్లోరిన్ స్పెర్లింగ్(58ని) గోల్స్ చేశారు. శనివారం జరిగే కాంస్య పోరు కోసం భారత్ పోటీకి దిగనుంది.