న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగిపోయాయి. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.179 పెరిగి రూ.47,452కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర 47,273 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలకు డిమాండ్ పెరుగడమే దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధర కూడా ఇవాళ ఢిల్లీలో రూ.826 పెరిగి రూ.71,541కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.70,715 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర రూ.1,836 పలుకగా, ఔన్స్ వెండి ధర రూ.27.65 పలికింది.