PV Sindhu | విశాఖ (Visakhapatnam)లో బ్యాడ్మింటన్ అకాడమీకి స్టార్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) భూమి పూజ చేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అకాడమీ నిర్మాణానికి తన తల్లిదండ్రులతో కలిసి గురువారం ఉదయం భూమి పూజ చేశారు. పనులు త్వరగా చేపట్టి ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఈ సందర్భంగా పీవీ సింధు తెలిపారు.
ఈ భూమి విషయంలో ఎలాంటి వివాదం లేదని.. ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. ఈ అకాడమీ ద్వారా ఎంతో మంది క్రీడాకారులను తయారు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అకాడమీకి సంబంధించిన అన్ని వివరాలూ త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా పీవీ సింధు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం పీవీ సింధుకు విశాఖపట్నంలోని పెదగదిలి కూడలి సమీపంలో భూమి కేటాయించిన విషయం తెలిసిందే.
Excited to break ground on the PV Sindhu Center for Badminton and Sports Excellence in Visakhapatnam! This isn’t just a facility; it’s the future—a bold step to elevate the next generation of champions and ignite the spirit of excellence in Indian sports.
With the unwavering… pic.twitter.com/aKAuqJ9HEK
— Pvsindhu (@Pvsindhu1) November 7, 2024
Also Read..
Donald Trump | ఇప్పుడు గెలిచినా.. వచ్చే ఏడాదే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం..!
US President | అమెరికా అధ్యక్షుడి జీతం.. ఇతర సౌకర్యాల గురించి తెలుసా..?
Janhvi Kapoor | మధురానగర్ హనుమాన్ ఆలయంలో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు