England XI : స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్(England) టీ20 పోరుకు సై అంటోంది. భారత జట్టుతో ఐదు టీ20లు ఆడనుంది ఆతిథ్య జట్టు. జూలై 1 బుధవారం నుంచే ఇరుజట్ల మధ్య పొట్టి సమరం మొదలవ్వనుంది. దాంతో, మంగళవారం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) తుది జట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ (Harry Brook) సారథిగా 11 మందితో కూడిన బృందంలో స్పిన్నర్లుగా ఆదిల్ రషీద్, లియాం డాసన్లు ఎంపికయ్యారు.
సొంతగడ్డపై బజ్ బాల్ వ్యూహం బెడిసికొట్టడంతో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న ఇంగ్లండ్ టీ20ల్లో భారత జట్టును ఢీకొట్టనుంది. టీమిండియాతో ఐదు మ్యాచుల సిరీస్ జూలై 1 బధువారం నుంచి మొదలవ్వనుంది. అందుకని ఆనవాయితీని కొనసాగిస్తూ.. ఒకరోజు ముందుగానే ఇంగ్లండ్, వేల్స్ బోర్డు పదకొండు మందిని ఎంపిక చేసింది.
JUST IN: England announce their XI to play India in the first T20I tomorrow 🏴 pic.twitter.com/q21cZpcwpt
— Cricinfo (@cricinfo) June 30, 2026
ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ .. మిడిలార్డర్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్ ఆడనున్నారు. పేస్ ఆల్రౌండర్గా సాయ్ కరన్.. స్పిన్నర్లుగా డాసన్, రషీద్ ఎంపికయ్యారు. పేస్ దళంలో ల్యూక్ వుడ్, సకీబ్ మహమూద్ ఉన్నారు. ఇక.. చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో ఊహించని విధంగా 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై గర్వించదగ్గ ప్రదర్శన చేయాలనుకుంటోంది.
ఇంగ్లండ్ తుది జట్టు : ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బ్యాంటన్, సాయ్ కరన్, విల్ జాక్స్, లియాం డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సకీబ్ మహమూద్.