ఓల్డ్ ట్రాఫర్డ్ : పాకిస్థాన్తో జరిగిన మూడవ టీ20లో.. ఇంగ్లండ్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. దీంతో 2-1 తేడాతో ఇంగ్లండ్ సిరీస్ను కైవసం చేసుకున్నది. చివరి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 154 రన్స్ చేసింది. పాక్ జట్టులో రిజ్వాన్ 76 రన్స్ చేశాడు. రషీద్కు నాలుగు వికెట్లు దక్కాయి. 155 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలుత పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే 64 రన్స్ చేసిన జేసన్ రాయ్ ఔట్ అయిన తర్వాత మ్యాచ్ ఇంగ్లండ్ పట్టు జారింది. ఆ సమయంలో పాక్ స్పిన్నర్లు వణికించారు. చివర్లో మోర్గాన్ కీలకమైన 21 రన్స్ చేశాడు. చివరి ఓవర్ వరకు వెళ్లిన మ్యాచ్లో జోర్డన్ విన్నింగ్ షాట్ కొట్టాడు.