కాన్బెర్రా : ఆస్ట్రేలియాతో జరిగిన మూ డు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత ఇంగ్లండ్ 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. డేవిడ్ మలన్ (82), మొయిన్ అలీ (44) రాణించారు. స్టోయినిస్ (3/34), ఆడమ్ జంపా (2/26) ఆకట్టుకున్నారు. లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (45), డేవిడ్(40) ఫర్వాలేదనిపించారు. సామ్ కరన్ (3/25) మూడు వికెట్లు తీశాడు.