ఇంగ్లండ్కు టీమ్ ఇండియా పయనం నేడే
న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో సుదీర్ఘ పర్యటనకు వెళ్లనున్న భారత ప్లేయర్లకు బీసీసీఐ తీపికబురు చెప్పింది. బ్రిటన్ టూర్కు వెళ్లే ప్లేయర్లు, సహాయక సిబ్బందితో వారి కుటుంబ సభ్యులను కూడా అనుమతించనుంది. ఈ విషయాన్ని బోర్డు అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. సుదీర్ఘ కాలం బయోబబుల్లో ఉండాల్సి రావడంతో కుటుంబ సభ్యులు దగ్గర ఉంటే ప్లేయర్లకు మానసిక బలం ఉంటుందని, అందుకే ఈసీబీతో చర్చించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని ఆ అధికారి చెప్పారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా సహా అధికారులెవరూ వెళ్లరని ఆయన వెల్లడించారు. ఇంగ్లండ్కు బయలుదేరే ముందు భారత పురుషుల, మహిళల జట్ల ప్లేయర్లు ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్లో ఉన్నారు. బుధవారం రెండు జట్లు ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్కు బయలుదేరనున్నాయి. కోహ్లీసేన ఈ నెల 18 నుంచి 22 వరకు న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సహా ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.