లండన్: స్వదేశంలో భారత్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఇటీవల కాలంలో ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటుతున్న యువ ఆల్రౌండర్ జేమ్స్ కోల్.. 17 మందితో కూడిన జట్టులోకి వచ్చాడు.
‘ది హండ్రెడ్’ లీగ్లో అత్యధిక ధర దక్కించుకుని రికార్డు నెలకొల్పిన కోల్ ఎంపిక మినహా జట్టులో పెద్దగా మార్పులేమీ లేవు. ఈ ఏడాది ముగిసిన టీ20 ప్రపంచకప్లో ఆడిన జట్టులో స్వల్ప మార్పులతో ఆ టీమ్ బరిలోకి దిగనుంది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఆతిథ్య జట్టు.. జూలై 1 నుంచి 11 వరకూ భారత్తో టీ20 సిరీస్ ఆడుతుంది.