లండన్: సొంతగడ్డపై మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం అర్ధరాత్రి ముగిసిన మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ 40 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్తో 75), మాజీ సారథి హీథర్ నైట్ (58) స్ఫూర్తిధాయక ప్రదర్శనతో ఆతిథ్య జట్టు తొలుత 20 ఓవర్లకు 169/5 స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 129/8కే పరిమితమైంది. ఒకదశలో 13 ఓవర్లకు 90/3తో గెలుపు దిశగా సాగిన సఫారీలు అనూహ్యంగా తడబడి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో వోల్వార్ట్ సేనకు మరోసారి నిరాశ తప్పలేదు.ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనుంది.