సిడ్నీ: ఇంగ్లండ్కు 142 పరుగుల లక్ష్యాన్ని విసిరింది శ్రీలంక. టీ20 వరల్డ్కప్లో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. ఓపెనర్ నిస్సంకా అత్యధికంగా 67 రన్స్ చేశాడు. నిస్సంకా ఇన్నింగ్స్లో అయిదు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. సూపర్12 పోరులో టాస్ గెలిచిన శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నది. ఓ దశలో భారీ స్కోర్ దిశగా వెళ్తున్న లంక బ్యాటర్లను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేశారు. లంక బ్యాటర్లలో మెండిస్ 18, రాజపక్స 22 రన్స్ చేశారు.ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిస్తేనే సెమీస్కు వెళ్తుంది.
Brilliant bowling at the death helps England restrict Sri Lanka to 141/8 👏#T20WorldCup | #SLvENG | 📝: https://t.co/goECJqYlQs pic.twitter.com/Jg03XijrhB
— ICC (@ICC) November 5, 2022