Nasser Hussain : టెస్టు క్రికెట్లో ఈమధ్య ఇంగ్లండ్(England) జట్టు అద్భుత విజయాలు సాధిస్తోంది. బాజ్బాల్(Bazzball) ఆటతో ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తోంది. తాజాగా సొంత గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్(Ashes Series)లోనూ ఇంగ్లండ్ అదిరిపోయే ప్రదర్శన చేసింది. బలమైన కంగారూలపై బాజ్బాల్ ఆటతో సిరీస్ సమం చేసుకుంది. అయితే.. ఇంగ్లండ్ జట్టు అనుసరిస్తున్న బాజ్బాల్ గేమ్కు భారత పిచ్లపై అసలైన సవాల్ ఎదురుకానుందని ఆదేశ మాజీ సారథి నాసిర్ హుస్సేన్(Nasser Hussain) అన్నాడు.
ఐసీసీ రివ్యూలో మాట్లాడిన అతను.. బెన్ స్టోక్స్(Ben Stokes) బృందం ఇండియన్ స్పిన్నర్లను ఎదుర్కోవడంపై బాజ్బాల్ సక్సెస్ అధారపడి ఉందని అతను తెలిపాడు. ‘భాజ్బాల్ గేమ్ ఒక జట్టుపైనే పనిచేస్తుందని కొందరు అన్నారు. కానీ, ఇంగ్లండ్ ఈమధ్య న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియాపై అద్భుత విజయాలు సాధించాడు. ఇక మిగిలింది భారతే.
ఇది బాజ్బాల్కు స్పిన్కు మధ్య జరిగే పోరాటం. బాజ్బాల్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin), రవీంద్ర జడేజా (Ravindra Jadeja), అక్షర్ పటేల్(Axar Patel). అందుకని ఇంగ్లండ్, భారత్ టెస్టు సిరీస్ రసవత్తరంగా ఉండనుంది. సొంతగడ్డపై టీమిండియా కఠిన ప్రత్యర్థి అనే విషయం తెలిసిందే’ అని హుస్సేన్ వెల్లడించాడు. ఇంగ్లండ్ జట్టు 2024 జనవరిలో భారత పర్యటనకు రానుంది.
ఇంగ్లండ్ జట్టు గత కొన్ని నెలలుగా సంచలన ఆటతో వార్తల్లో నిలుస్తోంది. హెడ్కోచ్గా విధ్వంసక ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum) రావడం, బెన్ స్టోక్స్(Ben Stokes) టెస్టు కెప్టెన్ కావడంతో ఆ జట్టు ప్రదర్శన మారిపోయింది. మెక్కల్లమ్ తన స్వభావమైన దూకుడును ఇంగ్లండ్ ఆటగాళ్లకు నేర్పాడు.
బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్కల్లమ్
దాంతో, టెస్టు మ్యాచ్ అంటే.. డ్రా చేసుకోవడం కంటే గెలవడం కోసమే ఆడడం అలవాటు చేశాడు. దాంతో, సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్ వన్డే తరహాలో చెలరేగిపోతోంది. అందుకు పాకిస్థాన్, ఐర్లాండ్పై సిరీస్ విజయాలు, ఆసీస్పై 2-2తో సిరీస్ డ్రా ఓ ఉదాహరణ మాత్రమే.