భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లిష్ పేసర్ టాప్లే దుమ్మురేపుతున్నాడు. వరుసగా ధవన్ (1), రోహిత్ (17)ను అవుట్ చేసిన టాప్లే.. కోహ్లీ (17)ని కూడా పెవిలియన్ చేర్చాడు. యాంగిల్ అవుతున్న బంతిని డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించిన కోహ్లీ.. మరోసారి అవుట్సైడ్ ఎడ్జ్కే వికెట్ పారేసుకున్నాడు.
టాప్లే వేసిన బంతి కోహ్లీ బ్యాటును ముద్దాడుతూ వెళ్లి బట్లర్ చేతుల్లో పడింది. ఈ వికెట్పై లక్ష్యాన్ని ఛేదించాల్సిన సమయంలో పోరాడవలసిన వెటరన్ బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో.. కోహ్లీ అభిమానులతోపాటు భారత జట్టు అభిమానులు కూడా మరోసారి నిరాశచెందారు.
On 🔥 🙌
Scorecard/clips: https://t.co/2efir2v7RD
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/KDQRAhCDSt
— England Cricket (@englandcricket) July 17, 2022