ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు విజయం దిశగా నెమ్మదిగా సాగుతోంది. ఆరు వికెట్లతో బుమ్రా చెలరేగడంతో తొలుత ఇంగ్లండ్ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్య ఛేదనను ప్రశాంతంగా ఆరంభించింది. చాలా రోజుల తర్వాత ఓపెనింగ్కు వచ్చిన శిఖర్ ధావన్ (15 నాటౌట్), రోహిత్ శర్మ (38 నాటౌట్) జోడీ ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించింది.
లక్ష్యం చిన్నదే కావడంతో అనవసర షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడిన ఈ జోడీ అడపాదడపా మంచి షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించింది. ఈ క్రమంలోనే పది ఓవర్లు ముగిసే సరికి వికెట్లేమీ కోల్పోకుండా 58 పరుగులు చేసింది.