ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్లో కూడా ప్రభావం చూపలేకపోయాడు. పాట్స్ వేసిన షార్ట్ బాల్ను పుల్ చేసేందుకు ప్రయత్నించిన శార్దూల్.. లాంగ్ లెగ్లో క్రాలీకి సులభమైన క్యాచ్ ఇచ్చాడు. దీంతో శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్ 4 పరుగులకే ముగిసింది.
భారత జట్టు 207 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ధాటిగా ఆడతాడని అనుకున్న శార్దూల్.. నిదానంగా ఆడుతుండటంతో ఆ తర్వాత జూలు విదిలిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆడిన తొలి భారీ షాట్కే క్యాచ్ ఇచ్చి అతను పెవిలియన్ చేరడంతో అభిమానులు నిరాశ చెందారు.