ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. స్వల్పస్కోర్లకే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. టాప్లే వేసిన మూడో ఓవర్ తొలి బంతికే ధావన్ (1) పెవిలియన్ చేరాడు. మళ్లీ టాప్లే వేసిన ఐదో ఓవర్లో రోహిత్ శర్మ (17) అవుటయ్యాడు. ఆఫ్స్టంప్కు ఆవలగా టాప్లే వేసిన బంతిని డిఫెన్స్ ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు.
కానీ యాంగిల్ అవుతున్న బంతి.. ఎడ్జ్ తీసుకొని స్లిప్స్లో ఉన్న రూట్ చేతుల్లో పడింది. దాంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 21 పరుగులు చేసింది.