ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో భారత కీపర్ రిషభ్ పంతో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులతో ఆకట్టుకున్న అతను.. రెండో ఇన్నింగ్స్లో 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మరో ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్లో అత్యధిక పరుగులు చేసిన భారత కీపర్ బ్యాటర్గా పంత్ రికార్డు నెలకొల్పాడు.
ఇంతకుముందు ఈ రికార్డు ధోనీ పేరిట ఉండేది. 2011లో ఇంగ్లండ్ పర్యటనలో ధోనీ ఒక టెస్టు మ్యాచ్లో 151 పరుగులు చేశాడు. ఇప్పుడు 203 పరుగులతో పంత్ ఈ రికార్డు బద్దలుకొట్టాడు. అంతేకాదు, విదేశాల్లో భారత్ తరఫున ఒక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన కీపర్గా కూడా రికార్డు నెలకొల్పాడు.
ఈ రికార్డు అంతకుముందు విజయ్ మంజ్రేకర్ పేరిట ఉండేది. అతను 1953లో జమైకాలోని కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 161 పరుగులు సాధించాడు. ఈ రికార్డును కూడా పంత్ బ్రేక్ చేశాడు.