భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో షార్ట్ బాల్కే పెవిలియన్ చేరిన అతను.. రెండో ఇన్నింగ్స్లో కూడా షార్ట్ బంతికే అవుటయ్యాడు. మాథ్యూ పాట్స్ వేసిన ఓవర్ తొలి బంతి కూడా షార్ట్ పిచ్ బంతే.
అయితే దాన్ని వదిలేసిన శ్రేయాస్.. మరుసటి బంతికే దొరికిపోయాడు. షార్ట్ బాల్ను పుల్ చేసేందుకు ప్రయత్నించి, మిడ్వికెట్లో ఉన్న ఆండర్సన్కు నేరుగా క్యాచ్ ఇచ్చాడు. దాంతో 19 పరుగులకే అయ్యర్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత జట్టు 190 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.