బ్యాటింగ్కు అనుకూలించే ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు జోస్ బట్లర్ (18), జేసన్ రాయ్ (27) శుభారంభం ఇవ్వలేకపోయారు.
అయితే బట్లర్ త్వరగా అవుటవడంతో వచ్చిన డేవిడ్ మలాన్ (77) అదిరే షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత లివింగ్స్టోన్ (42 నాటౌట్) కూడా రాణించాడు. ఫిల్ సాల్ట్ (8), హ్యారీ బ్రూక్ (9 బంతుల్లో 19), క్రిస్ జోర్డాన్ (3 బంతుల్లో 11) పరుగులు చేశారు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు 215/7 స్కోరుతో ఇన్నింగ్స్ ముగించింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీయగా.. ఆవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Innings Break!
England post a total of 215/7 on the board.#TeamIndia chase coming up shortly. Stay tuned!
Scorecard – https://t.co/hMsXyHNzf8 #ENGvIND pic.twitter.com/NgJfWJE6St
— BCCI (@BCCI) July 10, 2022