ఇండియన్ వెల్స్: ఈ ఏడాది టెన్నిస్ ఆరంభ సీజన్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్లో ఫైనల్లో ఢీకొన్న అరీనా సబలెంకా (బెలారస్), ఎలీనా రిబాకినా (కజకిస్థాన్) మరోసారి టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరూ బీఎన్పీ పారిబాస్ ఓపెన్ (ఇండియన్ వెల్స్) టోర్నీలో ఫైనల్కు చేరారు. మహిళల సింగిల్స్ సెమీస్లో టాప్ సీడ్ సబలెంకా.. 6-3, 6-4తో లిండా నొస్కొవ (చెక్)పై సునాయస విజయం సాధించింది.
గడిచిన నాలుగేండ్లలో ఆమెకు ఇది మూడో ఫైనల్ కావడం విశేషం. రెండో సెమీస్లో రిబాకినా.. 7-5, 6-4తో స్వితోలినా (ఉక్రెయిన్)ను చిత్తుచేసి సబలెంకాతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో ఈ ఇద్దరి మధ్య జరిగిన ఫైనల్లో రిబాకినానే అదృష్టం వరించిన విషయం తెలిసిందే.
కాగా పురుషుల డబుల్స్లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ జోడీ పోరాటం సెమీస్కే పరిమితమైంది. తొలిసారి ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో సెమీస్కు చేరిన బాంబ్రీ, గొరన్సన్ (స్వీడన్) జోడీ.. 5-7, 7-6 (7/3) 5-10తో ఆర్థర్ రిండర్నెక్ (ఫ్రాన్స్), వాలెంటిన్ (మొనాకో) చేతిలో ఓడింది.