ముగింపుదశకు చేరుకున్న కామన్వెల్త్ క్రీడలలో భారత్కు క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. ఇతర క్రీడలతో పాటు అథ్లెట్స్ కూడా అద్భుతాలు చేస్తున్నారు. ఇప్పటికే లాంగ్ జంప్, హై జంప్, రేస్ వాక్, స్టీఫుల్ ఛేజ్ వంటి పోటీలలో తొలిసారి పతకాలు నెగ్గిన భారత అథ్లెట్లు.. తాజాగా ట్రిపుల్ జంప్లో సైతం సత్తా చాటారు. ఆదివారం జరిగిన ట్రిపుల్ జంప్ ఈవెంట్లో ఏకంగా స్వర్ణం, రజతం కూడా మనకే దక్కింది. కాస్త మిస్ అయినా.. నాలుగో స్థానం కూడా మనదే.
బర్మింగ్హామ్ వేదికగా ఆదివారం ముగిసిన ట్రిపుల్ జంప్ ఈవెంట్లో ఎల్డోస్ పాల్.. 17.03 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. ఈ ఈవెంట్లో భాగంగా కామన్వెల్త్ గేమ్స్లో ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. పాల్తో పాటు అబ్దుల్లా అబూబాకర్.. 16.92 మీటర్లు దూకి రజతం నెగ్గాడు. అయితే అతడు తన తొలి ప్రయత్నంలో ఏకంగా 17.2 మీటర్లు దూకాడం విశేషం.
ఈ ఈవెంట్లో భారత్ కాంస్యం కూడా సాధించేది. మరో భారత ఆటగాడు ప్రవీణ్ చిత్రవెల్ 16.89 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. బెర్ముడాకు చెందిన ఝా-నె పెరించిఫ్ 16.92 మీటర్లతో మూడో స్థానాన్ని సాధించి కాంస్యం నెగ్గాడు.
This is Super Special folks 💫
GOLD & SILVER medal for India in Men’s Triple Jump event.
👉 Eldhose Paul won Gold | 17.03m
👉 Abdulla Aboobacker won Silver | 17.02m
👉 Praveen Chitravel finished 4th | 16.89m @afiindia #CWG2022 #CWGwithIAS pic.twitter.com/zFElheACWU— India_AllSports (@India_AllSports) August 7, 2022