అడిలైడ్: టీ20 ప్రపంచకప్లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్తో జరుగనున్న మ్యాచ్లో సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ బరిలో దిగడం అనుమానంగా కనిపిస్తున్నది. ఆదివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వెన్నునొప్పితో మధ్యలోనే మైదానాన్ని వీడిన కార్తీక్.. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దీంతో అతడి స్థానంలో యువ కీపర్ రిషబ్ పంత్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
‘కార్తీక్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తున్నది. ఇప్పుడప్పుడే నిర్ణయానికి రాలేం’ అని బోర్డు అధికారి తెలిపారు. ఫినిషర్గా జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్ ప్రపంచకప్లో బ్యాటింగ్ చేసిన రెండు మ్యాచ్ల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు ఆస్ట్రేలియా పిచ్లపై మంచి రికార్డు ఉన్న పంత్ను బెంచ్కే పరిమితం చేయడంపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు.