Dinesh Karthik : భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik ) కోచ్గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. కొంతకాలంగా కామెంటేటర్గా అదరగొడుతున్నకార్తీక్ ఇంగ్లండ్ లయన్స్(England Lions) జట్టుకు కోచ్గా ఎంపియ్యాడు. భారత ‘ఏ’ జట్టుతో జరిగే మూడు నాలురు రోజుల మ్యాచ్ల సిరీస్ కోసం ఇంగ్లీష్ జట్టు కార్తీక్ను బ్యాటింగ్ కన్సల్టెంట్(Battind Consultant)గా తీసుకుంది. తొమ్మిది రోజుల పాటు ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ ఆ జట్టుకు సేవలందించనున్నాడు.
ఇంగ్లండ్ లయన్స్ టీమ్ భారత ఏ జట్టుతో జనవరి 12న తొలి వామప్ మ్యాచ్ ఆడనుంది. అనంతరం జనవరి 17న అహ్మదాబాద్ స్టేడియంలో నాలుగు రోజుల మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 13 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. బెంగాల్ ఒపెనర్ అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran) భారత ఏ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.
భారత ఏ జట్టు స్క్వాడ్ : అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోశ్ రంజన్ పౌల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), మనవ్ సుథార్, పుల్కిత్ నరంగ్, నవ్దీప్ సైనీ, తుషార్ దేశ్పాండే, విద్వత్ కవెరప్ప, ధ్రువ్ జురెల్, అకాశ్ దీప్.
ఐపీఎల్ 15వ సీజన్లో మెరుపు ఇన్నింగ్స్లతో కార్తీక్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. 2022లో ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్లో వికెట్ కీపర్, ఫినిషర్గా ఎంపికైన కార్తీక్ చెత్త ఆటతో తీవ్ర విమర్శల పాలయ్యాడు. అంతేకాదు ఐపీఎల్ 16వ సీజన్లోనే ఈ స్టార్ క్రికెటర్ దారుణంగా విఫలమయ్యాడు. మొత్తంగా 13 మ్యాచుల్లో 140 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, కెప్టెన్ డూప్లెసిన్ శుభారంభాలు ఇచ్చినా మిగతా వాళ్లు చేతులెత్తేయడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ముంగిటే బొక్కాబోర్లాపడింది.