కాక్సియాస్: ప్రతిష్ఠాత్మక బధిర ఒలింపిక్స్లో భారత గోల్ఫర్ దీక్ష డాగర్ స్వర్ణం కొల్లగొట్టింది. బ్రెజిల్ వేదికగా గురువారం జరిగిన ఫైనల్లో అష్లిన్ గ్రేస్ (అమెరికా)ను ఓడించి బంగారు పతకం చేజిక్కించుకుంది. 2017లో డెఫ్లింపిక్స్లో రజతం సాధించిన 21 ఏండ్ల దీక్ష ఈ టోర్నీలో పసిడి కోసం బరిలోకి దిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఈ టోర్నీలో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు మన తన ఖాతాలో చేరగా.. వీటిలో తెలంగాణ యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ రెండు స్వర్ణాలు చేజిక్కించుకోవడం విశేషం.