రాంచీ: మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పిన తర్వాత రాంచీలో ఆయన ఫార్మౌజ్ తీసుకున్నారు. అక్కడ వివిధరకాల కూరగాయలు, పండ్ల తోటలు ఉన్నాయి. అయితే హోలీ సందర్భంగా ఫార్మౌజ్ను మూడు రోజుల పాటు ప్రజల కోసం ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. సెంబోలో ఉన్న ఫార్మ్ను 17, 18, 19 తేదీల్లో ఎవరైనా విజిట్ చేయవచ్చు. ఆ ఫార్మ్లో పండిస్తున్న కూరగాయలు, స్ట్రాబెర్రీలను కొనవచ్చు. అయితే పావు కిలో బెర్రీలను రూ.50కి అమ్మనున్నారు. జార్ఖండ్లోని రాంచీకి సమీపంలో ఉన్న చంబో ప్రాంతంలో ధోనీకి 43 ఎకరాల ఫార్మౌజ్ ఉంది. ఇజా ఫార్మ్స్ పేరిట దాన్ని నడుపుతున్నారు. అక్కడ పౌల్ట్రీ, డెయిరీ కూడా ఉంది. ధోనీ తోటల్లో స్ట్రాబెర్రీ, పొప్పడి, జామకాయ, ఖర్బూజా, బఠాణీలు, కాప్సికమ్ పండిస్తున్నారు. చేపలు, గోధుమలను కూడా పెద్ద ఎత్తున ఫార్మింగ్ చేస్తున్నారు. తరుచూ ధోనీ తన ఫార్మౌజ్ను విజిట్ చేస్తుంటారని అగ్రికల్చర్ కన్సల్టెంట్ రోషన్ కుమార్ తెలిపారు.