అహ్మాదాబాద్: మిస్టర్ కూల్ ధోనీ.. తన మాస్టర్మైండ్తో ఐపీఎల్(IPL 2023) టైటిల్ను చేజిక్కించుకున్నాడు. అహ్మాదాబాద్లో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్ ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ అయిదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో 10 రన్స్ అవసరమైన వేళ.. జడ్డూ తన స్ట్రోక్ప్లేతో గుజరాత్కు షాకిచ్చాడు.
ఇక ఆ విజయం వెనుక ఎన్నో ఆనంద క్షణాలు దాగి ఉన్నాయి. ట్రోఫీని అయిదోసారి గెలిచిన సంతోషంలో విన్నింగ్ షాట్ కొట్టిన జడేజాను ధోనీ ఎత్తుకున్నాడు. ఆ తర్వాత ప్రత్యర్థి జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను కూడా ధోనీ ప్రశంసించాడు. ధోనీ కూతురు జీవా కూడా మోదీ స్టేడియంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
మైదానంలోకి వచ్చిన జీవా తన తండ్రిని తనివితీరా హత్తుకున్నది. ధోనీ భార్య సాక్షీ కూడా చెన్నై ఆటగాళ్లతో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నది. ఆ అద్భుత క్షణాలకు చెందిన వీడియోను ఇవాళ ఐపీఎల్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. సీఎస్కే ప్లేయర్లతో కలిసి జీవా ఐపీఎల్ ట్రోఫీని ఎత్తుకున్నది.
We are not crying, you are 🥹
The Legend continues to grow 🫡#TATAIPL | #Final | #CSKvGT | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/650x9lr2vH
— IndianPremierLeague (@IPL) May 30, 2023
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 రన్స్ చేసింది. వర్షం వల్ల చెన్నైకు టార్గెట్ను ఫిక్స్ చేశారు. 15 ఓవర్లలో ఆ జట్టు 171 చేయాల్సి ఉంది. అయితే చివరి బంతి వరకు సాగిన మ్యాచ్లో చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. చివరి రెండు బంతుల్లో 10 రన్స్ చేసిన జడేజా జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
Read More..
CM Stalin: చెన్నైకి అయిదోసారి టైటిల్.. ధోనీని మెచ్చుకున్న సీఎం స్టాలిన్