న్యూఢిల్లీ : పరువునష్టం దావా కేసులో రెజ్లర్ బజరంగ్ పునియాకు ఢిల్లీ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో బజరంగ్ తన పేరును ప్రస్తావించి పరువు నష్టం కలిగించాడని కోచ్ నరేష్ దహియా కోర్టును ఆశ్రయించాడు.
దీనిపై కోర్టు బజరంగ్కు సమన్లు జారీచేసింది. తనకు కోర్టులో హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని బజరంగ్ చేసిన అభ్యర్థన మేరకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ మార్చి 5న జరుగుతుందని దహియా న్యాయవాది తెలిపారు.