WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో నిరుడు రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) బోణీ కొట్టింది. సోమవారం యూపీ వారియర్స్(UP Warriorz)పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి విజయం ఉత్సాహంలో ఉన్న ఆ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. డబ్ల్యూపీఎల్ నిబంధనలను ఉల్లఘించిన ఢిల్లీ పేసర్ అరుంధతి రెడ్డి (Aundhati Reddy)కి ఫైన్ పడింది. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్టు డబ్ల్యూపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది.
‘చిన్నస్వామి స్టేడియంలో యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అరుంధతి రెడ్డి డబ్ల్యూపీఎల్ నియమ నిబంధనలను అతిక్రమించింది. లెవల్ 1 నేరానికి పాల్పడింది. దాంతో, రిఫరీ అరుంధతిపై ఫిర్యాదు చేయగా.. ఆమె తన తప్పును అంగీకరించింది. అందుకని అరుంధతికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించాం’ అని డబ్ల్యూపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు.
The @DelhiCapitals register their maiden victory of #TATAWPL 2024 🙌
A splendid run-chase produces a 9-wicket win for #DC 💪
Match Centre 💻📱https://t.co/YnKaBW7IeD#UPWvDC pic.twitter.com/zWHEAu98c3
— Women’s Premier League (WPL) (@wplt20) February 26, 2024
ఫిబ్రవరి 23న జరిగిన ఆరంభ పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో షాక్ తిన్న ఢిల్లీ జట్టు రెండో పోరులో గర్జించింది. తొలుత యూపీని 119 పరుగులకే కట్టడి చేసింది. రాధా యాదవ్ 4 వికెట్లతో యూపీని కోలుకోలేని దెబ్బ తీసింది. అరుంధతి టెయిలెండర్ ఖేమ్నర్ వికెట్ తీసింది. అనంతరం స్వల్ప ఛేదనలో ఓపెనర్లు షఫాలీ వర్మ (64), మేగ్ లానింగ్(51)లు అర్థ శతకంతో కదం తొక్కారు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో యూపీపై గెలుపొందింది. తర్వాతి మ్యాచ్లో ఢిల్లీ ఫిబ్రవరి 29న రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొననుంది.