ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (3/11) విజృంభించడంతో మహిళల ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. సోమవారం చివరి లీగ్ మ్యాచ్లో మన అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేశారు.
తొలుత వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 13.5 ఓవర్లలో 95/2 స్కోరు చేసింది.