Deepti Sharma : మరికొద్ది రోజుల్లో దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 వరల్డ్ కప్ సమరం మొదలు కానుంది. ఈ టోర్నీలో ఫేవరెట్ జట్లలో భారత్ ఒకటి. ఈమధ్యే ఆ దేశంలో త్రైపాక్షిక సిరీస్ ఆడిన టీమిండియాకు అక్కడి పిచ్లు అనుకూలిస్తాయిని ఆల్రౌండర్ దీప్తి శర్మ తెలిపింది. సఫారీ పిచ్లపై స్పిన్నర్లకు టర్న్ లభిస్తుందని, అక్కడి వికెట్లు తమ జట్టకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆమె చెప్పింది. రెండు రోజుల క్రితం ముగిసిన త్రైపాక్షిక సిరీస్ ఫైనల్లో భారత్ ఓడిపోయింది. ఈ సిరీస్లో దీప్తి అత్యధిక వికెట్లు తీసింది. ఐదు మ్యాచుల్లో ఈ స్పిన్నర్ 9 వికెట్లు పడగొట్టి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికైంది. హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలో భారత జట్టు ఈసారి టైటిల్పై కన్నేసింది. ఇంతకు వరల్డ్ కప్ ఎప్పుడు ప్రారంభం కానుంది అంటే..?
10 జట్లు..మూడు వేదికలు
మహిళల పొట్టి ప్రపంచ కప్ ఫిబ్రవరి 10 నుంచి 26వ తేదీ వరకు జరగనుంది. దక్షిణాఫ్రికాలోని మూడు వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. ఈ సారి నిర్వహిస్తున్న ఎనిమిదో వరల్డ్ కప్లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టీమ్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో ఐదు జట్లు ఉన్నాయి. ఏ గ్రూప్లో ఏ జట్లు ఉన్నాయంటే..?
గ్రూప్-1లోని జట్లు – ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక.
గ్రూప్-2 లోని జట్లు – ఇంగ్లండ్, భారత్, ఐర్లాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్.