ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించారు. చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా.. కుల్దీప్ తొలి బంతికే సిక్సర్ బాదాడు. తర్వాతి బంతి వైడ్, మరుసటి బంతికి సింగిల్ తీశాడు. ఆ తర్వాత మూడు బంతులను భారీ షాట్లు ఆడేందుకు కష్టపడిన అక్షర్.. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టినా ఉపయోగం లేకపోయింది.
దీంతో లక్నో జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది లక్నోకు వరుసగా మూడో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో ఈ జట్టు రెండో స్థానాన్ని ఆక్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో వార్నర్ (3), పృథ్వీ షా (5) నిరాశపరిచారు. పంత్ (44), మిచెల్ మార్ష్ (37), రావ్మెన్ పావెల్ (35), అక్షర్ పటేల్ (42 నాటౌట్), కుల్దీప్ యాదవ్ (16 నాటౌట్) రాణించారు.
లలిత్ యాదవ్ (3), శార్దూల్ ఠాకూర్ (1) విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చమీర, రవి బిష్ణోయి, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ తీసుకున్నారు.
Mohsin Khan is our Top Performer from the second innings for his brilliant bowling figures of 4/16 👏👏
A look at his bowling summary here 👇👇 #TATAIPL #DCvLSG pic.twitter.com/UzDlFJMPm8
— IndianPremierLeague (@IPL) May 1, 2022