లండన్: వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ జూలు విదిల్చింది. న్యూజిలాండ్తో జరిగిన నాలుగో వన్డేలో 100 పరుగుల తేడాతో నెగ్గి 4 మ్యాచ్ల సిరీస్ను 3-1తో హస్తగతం చేసుకుంది. మొదట ఇంగ్లిష్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 311 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ (127) సెంచరీతో కదంతొక్కాడు.
కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 38.2 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (61) టాప్ స్కోరర్ కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ 4 వికెట్లు పడగొట్టాడు. మలన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.