చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫామ్లోకి వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో వార్నర్ దూకుడుగా ఆడుతున్నాడు. 150 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్రైజర్స్కు పవర్ ప్లే ఆఖరికి 50/1తో శుభారంభం లభించింది. ఆదిలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(1) ఔటైనా హైదరాబాద్ ఏమాత్రం జోరు తగ్గించలేదు. ముఖ్యంగా వార్నర్ బౌండరీలతో విజృంభిస్తున్నాడు. మరో ఎండ్లో మనీశ్ పాండే సైతం వీలుచిక్కనప్పుడల్లా భారీ షాట్లు ఆడుతున్నాడు. 8 ఓవర్లకు సన్రైజర్స్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. వార్నర్(30), పాండే(26) బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నారు.