హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సైబర్ పోలీసులు విశాఖ కేంద్రంగా సాగుతున్న రూ.350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా గుట్టును రట్టు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న కింగ్మోను అలియాస్ దినేశ్, వాసుదేవ్, సూరిబాబుతోపాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
అనామక మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క కింగ్మోను అకౌంట్స్ నుంచే రూ.145 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన పోలీసులు నిందితుల నుంచి నగదు, సెల్ఫోన్లు, ల్యాప్ట్యాప్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది యువత బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్నట్టు తెలిపారు. సీపీ రవిశంకర్ స్వయంగా విచారణ చేస్తున్నారు. బెట్టింగ్లకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.