బర్మింగ్హాం: కామన్వెల్త్ మహిళా క్రికెట్లో టీమ్ఇండియా సెమీస్కు దూసుకెళ్లింది. బార్బడోస్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో గ్రూప్-ఏ నుంచి సెమీస్కు అర్హత సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన (5), కెప్టెన్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (డకౌట్), తానియా (6) తక్కువ స్కోర్లకే వెనుతిరిగారు. అయితే మరో ఓపెనర్ షషాలీ వర్మ (43), రోడ్రిగ్స్ (56 నాటౌట్) తో కలిసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షెఫాలీ ఔటవడంతో క్రీజ్లోకి వచ్చిన హర్మన్ డకౌట్ అయింది. ఆ తర్వాత వచ్చిన తానియా కూడా వెంటనే పెవీలియన్కు చేరడంతో జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే రోడ్రిగ్స్కు దీప్తి శర్మ (31 నాటౌట్) తోడవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
కాగా, 163 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బార్బడోస్ బ్యాటర్లు.. భారత బౌలర్ రేణుకా సింగ్ విజృంభణతో చేతులెత్తేశారు. రేణుకా సింగ్ 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. బార్బడోస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 62 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమ్ఇండియా 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.