కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్లో సాతియాన్ జ్ఞానశేఖరన్ సత్తా చాటాడు. సెమీస్లో ఇంగ్లండ్కు చెందిన లియామ్ పిచ్ఫోర్డ్ చేతిలో ఓటమి చవిచూసిన సాతియాన్.. కాంస్యం కోసం మరో ఇంగ్లండ్ ప్లేయర్ పాల్ డ్రింక్హాల్తో తలపడ్డాడు.
ఈ పోరులో 29 ఏళ్ల జ్ఞానశేఖరన్..9-11, 3-11, 5-11, 11-8, 11-8, 12-10, 9-11 తేడాతో విజయం సాధించాడు. మొత్తం ఏడు గేమ్స్లో నాలుగింట గెలిచిన సాతియాన్.. తన కెరీర్లో ఆరో కామన్వెల్త్ పతకం సాధించాడు. అయితే సింగిల్స్ విభాగంలో మాత్రం అతనికిదే తొలి పతకం కావడం విశేషం.
ఇంతకుముందు 2018, 2022లో పురుషుల టీం విభాగంలో స్వర్ణం గెలిచిన అతను.. మెన్స్ డబుల్స్లో సిల్వర్ మెడల్ సాధించాడు. అలాగే 2018లోనే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్యం గెలిచాడు. ఇప్పుడు తాజాగా పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్యంతో అతని ఖాతాలోని కామన్వెల్త్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది.
🏓👏 𝐖𝐄𝐋𝐋 𝐃𝐎𝐍𝐄! Kudos to the paddler on winning his first medal in the Men's Singles event at the Commonwealth Games.
👏 What a fighter!
📸 Getty • #SathiyanGnanasekaran #TableTennis #B2022 #CWG2022 #TeamIndia #BharatArmy pic.twitter.com/1tpqHjR91N
— The Bharat Army (@thebharatarmy) August 8, 2022