ఆడిన ప్రతి టోర్నీలో సత్తా చాటుతూ క్రీడాభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్ చేరిన ఈ 20 ఏళ్ల కుర్రాడు.. మలేషియాకు చెందిన ఎన్జీ టీ యాంగ్ను మట్టికరిపించి స్వర్ణాన్ని ఒడిసి పట్టేశాడు.
ఇది భారత్ ఖాతాలో చేరిన 20వ స్వర్ణ పతకం కావడం విశేషం. యాంగ్పై 1-2 తేడాతో లక్ష్యసేన్ విజయం సాధించడంతో కామన్వెల్త్ క్రీడల చరిత్రలో భారత్ నయా చరిత్ర లిఖించింది. మహిళల సింగిల్స్తోపాటు పురుషుల సింగిల్స్లో కూడా భారత్కు స్వర్ణాలు దక్కడం ఇదే తొలిసారి.
🏸LAKSHYA ACHIEVED 🥇!!
Our young sensation @lakshya_sen clinches the GOLD after a solid comeback, winning 2-1 (19-21 21-9 21-16) against Tze Yong (MAS) in the Badminton MS Gold Medal bout at the #CommonwealthGames2022🥇#Cheer4India pic.twitter.com/FdSw6dWXrG
— SAI Media (@Media_SAI) August 8, 2022