ఇంగ్లండ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత యువ వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్రి నుంగ కూడా సత్తాచాటాడు. పురుషుల 67 కేజీల విభాగంలో పోటీపడిన జెరెమీ.. స్నాచ్లో ఏకంగా 140 కేజీల బరువు ఎత్తాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్లో 160 కేజీల బరువు ఎత్తి రికార్డు సృష్టించాడు.
ఇలా మొత్తమ్మీద 300 కేజీలతో స్వర్ణపతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు కావడం గమనార్హం. దీంతో వెయిట్లిఫ్టింగ్లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. అంతకుముందు మీరాబాయి చాను కూడా స్వర్ణపతకం సాధించిన సంగతి తెలిసిందే.