ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు ఓపెనర్లు రుతురాజ్, కాన్వేతోపాటు ధోనీ, దూబే కూడా ధాటిగా ఆడటంతో 208 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి సరైన ఆరంభం లభించలేదు. రెండో ఓవర్లోనే భరత్ (8) వికెట్ కోల్పోయిన ఆ జట్టు.. కాసేపటికే వార్నర్ (19) కూడా పెవిలియన్ చేరాడు.
మిచెల్ మార్ష్ (25), రిషభ్ పంత్ (21) కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మొయీన్ అలీ వచ్చి వీళ్లిద్దరినీ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు రావ్మెన్ పావెల్ (3), రిపాల్ పటేల్ (6), అక్షర్ పటేల్ (1), కుల్దీప్ యాదవ్ (5), ఖలీల్ యాదవ్ (0) స్వల్పస్కోర్లకే పెవిలియన్ చేరారు. శార్దూల్ ఠాకూర్ (24) ఒక్కడే కాసేపు నిలబడ్డాడు.
అతన్ని కూడా బ్రావో అవుట్ చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు 17.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. చెన్నై జట్టు 92 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. చెన్నై బౌలర్లలో మొయీన్ అలీ మూడు వికెట్లు తీసుకున్నాడు. ముకేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, డ్వేన్ బ్రావో తలా రెండు వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ ఒక వికెట్ తీశాడు.
Yellow all the way 💛💛
A comprehensive 91-run win for Chennai Super Kings over Delhi Capitals – WHAT A WIN! #TATAIPL #CSKvDC #IPL2022 pic.twitter.com/O7yTOV0FnQ
— IndianPremierLeague (@IPL) May 8, 2022