IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి ముందే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఓపెనర్ డెవాన్ కాన్వే(Devan Conway), యంగ్ పేసర్ మథీశ పథిరన(Matheesha Pathirana)లు గాయం కారణంగా తొలి విడత మ్యాచ్లకు దూరమయ్యారు. తాజాగా వీళ్ల జాబితాలో స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rehman) చేరాడు. తొడ కండరాల గాయంతో బాధ పడుతున్న అతడు మరో నాలుగు రోజుల్లో కోలుకుంటాడా? లేదా? అనేది అనుమానంగా ఉంది.
17వ సీజన్లో చెన్నై మార్చి 22న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ వరకూ ముస్తాఫిజుర్ సీఎస్కే క్యాంప్లో చేరతాడా? లేదా? అని ఫ్రాంచైజీ, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగిందంటే..? శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న మూడో వన్డేలో ముస్తాఫిజుర్ అనూహ్యంగా మైదానం వీడాడు. అప్పటికే రెండు వికెట్లు తీసిన అతడికి 48 వ ఓవర్ మొదటి బంతి వేస్తుండగా కాలి కండరాలు పట్టేశాయి. దాంతో, నొప్పి భరించలేక కింద పడిపోయాడు. బాధతో విలవిలలాడుతున్న ముస్తాఫిజుర్ను సిబ్బంది స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు. అతడు ఎన్ని రోజుల్లో కోలుకుంటాడు? అనేది బంగ్లా క్రికెట్ బోర్డు ఇంకా వెల్లడించలేదు.
ముస్తాఫిజుర్, మథీశ పథిరన
ఇంతకుముందు ముస్తాఫిజుర్ తలకు బంతి తగలడంతో రక్తమోడుతూ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి కోలుకున్న పేసర్ తాజాగా కండరాలు పట్టేయడంతో మరికొన్ని రోజులు ఆటకు దూరమయ్యే చాన్స్ ఉంది. పథిరన సైతం గాయం కారణంగా ఐపీఎల్ 17వ సీజన్లో కొన్ని మ్యాచ్లు ఆడడపోవచ్చు. ఇద్దురు పేసర్ల గైర్హజరీలో యువ బౌలర్లు తుషార్ దేశ్పాండ్, ఆకాశ్ దీప్లపైనే భారం పడనుంది. డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా పేరొందిన ముస్తాఫిజుర్ను 17వ సీజన్ మినీ వేలంలో సీఎస్కే రూ.2 కోట్లకు కొన్నది.