IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ మరికాసేపట్లో మొదలు కానుంది. తొలి మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సేన, మాజీ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans)తో తలపడనుంది. ఈ మ్యాచ్లో అందరి కళ్లు ధోనీ పైనే ఉండనున్నాయి. ఐపీఎల్లో అరుదైన రికార్డుకు అతను చేరువలో ఉన్నాడు. మరో 22 పరుగులు చేస్తే 5 వేల పరుగుల క్లబ్లో చేరతాడు.
ప్రస్తుతం మిస్టర్ కూల్ కెప్టెన్ ఖాతాలో 4,978 రన్స్ ఉన్నాయి. 234 మ్యాచుల్లో అతను ఇన్ని పరుగులు స్కోర్ చేశాడు. ఇప్పటికే ఈ లీగ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఏబీ డివిల్లియర్స్, డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ 5 వేలకు పైగా పరుగులు సాధించారు.
గత సీజన్ తర్వాత క్రికెట్ బ్యాట్ పట్టని ధోనీ ఈసారి ఫినిషర్గా రాణిస్తాడా? లేదా? అనే ఆసక్తి అందరిలో ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్లో భారీ షాట్లు ఆడిన మహీ మళ్లీ హెలికాప్టర్ షాట్లతో అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పదిహేనో సీజన్లో సీఎస్కే 9వ స్థానంలో నిలిచింది. రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించడం, ఆ తర్వాత ధోనీకే మళ్లీ పగ్గాలు ఇవ్వడం వంటివి కొంత వివాదస్పదం అయ్యాయి. ఈసారి ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ రాకతో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. అతడితో పాటు రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివం దూబే, ఆఖర్లో ధోనీ చెలరేగి ఆడడంపైనే సీఎస్కే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.