Ambati Rayudu : ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023) ఫైనల్ ప్రారంభానికి మరికొన్ని నిమిషాలే ఉంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ పోరులో ఢీ కొంటున్నాయి. కోట్లాది మంది ఫ్యాన్స్ విజేతగా నిలిచేది ఎవరు? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్కు గుడ్ బై చెప్తున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఇదే తన ఆఖరి మ్యాచ్ అని అంబటి రాయుడు అందులో పేర్కొన్నాడు. ఈరోజు అతడు 200 మ్యాచ్ ఆడనున్నాడు.
‘ముంబై, సీఎస్కే.. ఇవి రెండు గొప్ప జట్లు. 204 మ్యాచ్లు, 14 సీజన్లు, 11 ప్లే ఆఫ్స్, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు సాధించాను. ఈరోజు రాత్రి ఆరో టైటిల్ అందుకుంటాననినమ్ముతున్నా. ఇన్నేళ్ల ప్రయాణం చాలా సాఫీగా సాగింది. ఈ గొప్ప టోర్నమెంట్లో ఆడడాన్ని నేను ఎంతగానో ఆస్వాదించాను. ఇన్ని రోజులు నాకు మద్దతుగా నిలిచిన. నాకు సహకారం అందించిన వాళ్లందరికీ ధన్యవాదాలు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన లేదు’ అని ట్వీట్లో రాసుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ, రాయుడు సేవల గురించి వివరిస్తూ ట్వీట్ పెట్టాడు.
2 great teams mi nd csk,204 matches,14 seasons,11 playoffs,8 finals,5 trophies.hopefully 6th tonight. It’s been quite a journey.I have decided that tonight’s final is going to be my last game in the Ipl.i truly hav enjoyed playing this great tournament.Thank u all. No u turn 😂🙏
— ATR (@RayuduAmbati) May 28, 2023
పవర్ హిట్టర్ అయిన రాయుడుకు ఐపీఎల్లో గొప్ప రికార్డు ఉంది. ఇప్పటివరకు 199 మ్యాచ్ల్లో అతను 4,290 రన్స్ కొట్టాడు. వీటిలో ఒక సెంచరీ, 22 అర్ధ శతకాలు ఉన్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్పై అతడు 69 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అంతేకాదు 37 కంటే ఎక్కువసార్లు రాయుడు 30 ప్లస్ స్కోర్ చేశాడు.
సన్రైజర్స్ హైదరాబాద్పై సెంచరీ కొట్టిన రాయుడు
రాయుడు ఐపీఎల్ కెరీర్ ముంబై ఇండియన్స్తో మొదలైంది. 2010లో ముంబై తరఫున అతడు ఆరంగ్రేటం చేశాడు. 2010 నుంచి 2017.. ఏడేళ్లు ఆ ఫ్రాంఛైజీతో కొనసాగాడు. కుడి చేతివాటం బ్యాటర్ అయిన అతడు 2013లో అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది ముంబై ట్రోఫీ నెగ్గడంలో రాయుడు పాత్ర ఉంది. ఆ తర్వాత 2018లో చెన్నై జట్టులోకి వచ్చాడు. 2021లో సీఎస్కే మళ్లీ అతడిని రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది.ధోనీ సారథ్యంలో చెన్నై రెండు టైటిళ్లు(205, 2017) గెలవడంలో రాయుడు తన వంతు పాత్ర పోషించాడు.