Cristiano Ronaldo : ఆటలో గెలుపు ఓటములు సహజమే. కానీ, ఆటగాళ్లు మాత్రం ఓటమిని తట్టుకోలేరు. అవును.. ఎన్నో మ్యాచులు గెలిచిన ఆటగాడిగైనా.. సాధారణ ప్లేయర్నైనా ఓటమి ఎంతో కుంగదీస్తుంది. ఆ బాధలో కంటతడి పెట్టేలా చేస్తుంది. తాజాగా ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) సైతం వలవలా ఏడ్చాడు. క్వార్టర్ ఫైనల్లో అల్ నస్రీ(Al Nassr) జట్టు ఓటమిని అతడు తట్టుకోలేకపోయాడు.
జట్టును గెలిపించలేకపోయాననే బాధతో ఈ స్టార్ ఫుట్బాలర్ మైదానంలోనే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఏఎఫ్సీ చాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్లో రొనాల్డో సారథ్యంలోని అల్ నస్రీ జట్టు అల్ ఐన్ టీమ్తో తలపడింది. ఆ మ్యాచ్లో రొనాల్డో చివరి నిమిషంలో పెనాల్టీని గోల్గా మలిచాడు.
#Ronaldo just didn’t go to Saudi Arabia for money, he puts his heart and soul into every match. Just look at the emotions💔. Unlike sitting on the bench like other players, he’s playing with everything he has got, he was the only one who scored the penalty. The entire team missed pic.twitter.com/IK2ad3ohzH
— NickyBaba (@Nicky__Baba) March 11, 2024
అయితే.. మిగతా వాళ్లు విఫలమవ్వడంతో అల్ నస్రీ జట్టు 3-1తో ఓటమిపాలైంది. అంతే.. రొనాల్డో గుండు ముక్కలైంది. ఆ బాధతో అతడికి కన్నీళ్లు ఆగలేదు. అల్ నస్రీ క్లబ్కు ఎన్నో విజయాలు అందించిన ఈ స్టార్ ఆటగాడు ఏడ్వడం చూసి అభిమానులు సైతం కంటతడి పెట్టుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్ 2022 తర్వాత రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీతో ఒప్పందం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమనగణం ఉన్న ఈ స్టార్ ఆటగాడికి, సౌదీ క్లబ్ మధ్య రూ.4,400 కోట్లు భారీ డీల్ కుదిరింది. తనపై కోట్లు కుమ్మరించిన క్లబ్కు రొనాల్డో విజయాల్ని బహుమతిగా ఇచ్చాడు. అతడి కెప్టెన్సీతో అల్ నస్రీ జట్టు సౌదీ ప్రో లీగ్లో విజేతగా అవతరించింది.