T20 World Cup 2024 : భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ తన్నుకుపోయిన ఆస్ట్రేలియా(Australia) మరో ఐసీసీ ట్రోఫీ కోసం సిద్ధమవుతుంది. జూన్లో జరుగబోయే పొట్టి వరల్డ్ కప్(T20 World Cup 2024 )లో ఆసీస్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. అయితే.. ఈ మెగా టోర్నీకి కెప్టెన్గా ఉండేందుకు ప్యాట్ కమిన్స్ నిరాకరించాడట. దాంతో, టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాకు ఆల్రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) సారథ్యం వహించే చాన్స్ ఉంది.
అరోన్ ఫించ్ రిటైర్మెంట్ తర్వాత టీ20 సారథిగా మార్ష్ మెప్పించాడు. గత కొంత కాలంగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. దాంతో, ఆ జట్టు హడెకోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ సైతం మార్ష్కు మద్దతు పలికాడు. న్యూజిలాండ్పై టెస్టు సిరీస్ విజయం అనంతరం కమిన్స్ మాట్లాడుతూ.. కెప్టెన్సీ బరువు లేకుండా తాను టీ20లను ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. దాంతో, ఆసీస్ సెలెక్టర్లు, హెడ్కోచ్లు మార్ష్ వైపు మొగ్గు చూపుతున్నారు.
‘టీ20 వరల్డ్ కప్లో కెప్టెన్గా అందరి చాయిస్ మార్ష్. అతడు టీ20 జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు’ అని మెక్ డొనాల్డ్ వెల్లడించాడు. ఫించ్ తర్వాత టీ20 సారథిగా ఎంపికైన మార్ష్ తొలి సిరీస్లోనే సక్సెస్ అయ్యాడు. అతడి నేతృత్వంలోని కంగారూ జట్టు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్పై సిరీస్లు గెలుపొందింది. దాంతో, మార్ష్నే కెప్టెన్గా కొనసాగించాలని ఆసీస్ బోర్డు, కోచ్లు భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1వ తేదీన టీ20 వరల్డ్ కప్ షురూ కానుంది. తొలి పోరులో ఆసీస్ జూన్ 6న పసికూన ఒమన్ జట్టుతో తలపడనుంది. అనంతరం జూన్ 9న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది.