Rishabh Pant – Axar Patel | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని (Lord Balaji Temple) టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్స్ (Team India Cricketers) రిషభ్ పంత్ (Rishabh Pant), అక్షర్ పటేల్ (Axar Patel) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న క్రికెటర్స్కు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శాలువాలతో సత్కరించి.. స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
మరోవైపు స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ (World Cup match)లో టీమ్ఇండియా (Team India) అప్రతిహత విజయాల పరంపర కొనసాగుతోంది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న రోహిత్ సేన స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో వరుసగా ఏడో విజయం సాధించింది. గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన పూర్తి ఏకపక్ష పోరులో భారత్ 302 పరుగుల తేడాతో శ్రీలంక (Sri Lanka)ను చిత్తు చేసింది. లంక బ్యాటర్లను భారత బౌలర్లు కోలుకోలేని దెబ్బకొట్టారు. దీంతో లక్ష్యఛేదనలో శ్రీలంక 19.4 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా విజయంతో దేశమంతా సంబరాలు చేసుకుంటోంది.
#WATCH | Tirupati, Andhra Pradesh: Cricketers Rishabh Pant and Axar Patel visit Lord Balaji Temple. pic.twitter.com/aZVv8SX9gL
— ANI (@ANI) November 3, 2023
Also Read..
MS Dhoni | షారుఖ్ బర్త్డే పార్టీలో తారల సందడి.. స్పెషల్ అట్రాక్షన్గా ధోనీ.. పిక్స్ వైరల్
Jaishankar | ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న జరిగిన దాడులు ఉగ్రవాద చర్యే : జైశంకర్